News October 21, 2024
SSC కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్
TG: SSC జీడీ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి జనవరి 31 వరకు టీ-శాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వారా క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇటు 1,388 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి కంటెంట్ను మరో రెండు గంటలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 16 వరకు రోజూ 4గంటలు ప్రసారం చేస్తామన్నారు.
Similar News
News October 21, 2024
గ్రూప్-1.. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
TG: గ్రూప్-1పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ను న్యాయమూర్తి పాస్ ఓవర్ చేశారు. లిస్ట్లో పిటిషన్లపై విచారణ మొత్తం పూర్తయ్యాక దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. కాగా గ్రూప్-1 అభ్యర్థుల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.
News October 21, 2024
హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారని అల్లు అర్జున్పై గతంలో కేసు నమోదైంది.
News October 21, 2024
ఘోరం.. తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం
సిలికాన్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవికుమార్ అనే వ్యాపారి వద్ద బాలిక తండ్రి రూ.70 వేలు తీసుకుని రూ.30వేలు తిరిగిచ్చాడు. మిగతా రూ.40వేలు, వడ్డీ కోసం రవికుమార్ నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు.