News March 24, 2024

విద్యార్థులకు శుభవార్త

image

AP: పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్థిరత్వం, ఉపాధి సాఫల్యత, వ్యవస్థాపక రంగాల్లో వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా స్కిల్స్ ప్రోగ్రాం నిర్వహించనుంది. ‘పాలిటెక్నిక్ రెండో, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, ధ్రువీకరణ పత్రం అందిస్తాం. విశాఖ జిల్లాలోని కాలేజీల్లో అమలు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం’ అని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.

Similar News

News April 19, 2025

ఫార్ములా ఈ-రేసు కేసు.. రెండో విడత దర్యాప్తు!

image

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో రెండో విడత దర్యాప్తు కోసం ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన అధికారులు, మరో 10 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించాలని నిర్ణయించారు. HMDA బోర్డు నిధుల నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

News April 19, 2025

JEE మెయిన్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ఎవరంటే?

image

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, వారిలో నలుగురు తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హర్ష గుప్తాకు 8, అజయ్ రెడ్డికి 16(ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటా మొదటి ర్యాంక్), బనిబ్రత మజీకి 24వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకుతో పాటు బాలికల్లో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.

News April 19, 2025

సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

image

వేసవికాలంలో ఎండల దెబ్బకు శరీరం చెమటతో తడిసిముద్దవుతుంది. దీని నుంచి రిలీఫ్ కావాలంటే కొన్ని రకాల దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు కాటన్‌తో కూడిన లూజ్ బట్టలు ధరించాలి. వీటి వల్ల చెమట ఈజీగా బయటకు వస్తుంది. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్ లెస్ టీషర్ట్స్ ధరించవచ్చు. లేత రంగుల దుస్తులు ధరించాలి. బ్లాక్, బ్లూ, రెడ్ వంటి రంగుల దుస్తులు వేసుకుంటే వేడిని గ్రహించి అలసిపోతారు.

error: Content is protected !!