News June 11, 2024
విద్యార్థులకు గుడ్న్యూస్
ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో ఏటా రెండుసార్లు జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు UGC చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. బోర్డు ఫలితాల్లో ఆలస్యం తదితర సమస్యల వల్ల జులై-ఆగస్టులో అడ్మిషన్ తీసుకోలేనివారు JAN-FEBలో ప్రవేశం పొందొచ్చన్నారు. కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించడం వల్ల పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని జగదీశ్ వెల్లడించారు.
Similar News
News October 6, 2024
క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే నిలిచిన SAARC: జైశంకర్
ఒక మెంబర్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే సార్క్ ప్రోగ్రెస్ ఆగిపోయిందని EAM జైశంకర్ అన్నారు. ఈ నెల్లోనే SCO మీటింగ్ కోసం పాక్ వెళ్తుండటంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టెర్రరిజాన్ని సహించేది లేదు. మాలో ఒకరు మరొకరిపై అలా చేస్తే దాన్ని ఆపాల్సిందే. అందుకే సార్క్ మీటింగ్స్ జరగడం లేదు. అయితే గత ఐదారేళ్లలో బంగ్లా, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంకతో భారత్ బంధం మెరుగైంది’ అని వివరించారు.
News October 6, 2024
ఆరోజు నమ్మకపోతే ‘శివ’,నేనూ ఉండేవాళ్లం కాదు: RGV
‘శివ’ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘నా లైఫ్కి బ్రేక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ అచంచలమైన మద్దతు, నాపై సంపూర్ణ విశ్వాసం లేకపోతే శివతో పాటు నేనూ ఉండేవాడినికాదు’ అని ట్వీట్ చేశారు. వర్మ తన కెరీర్ను ‘శివ’తో మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
News October 6, 2024
ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ తెలిపారు.