News November 6, 2024
విద్యార్థులకు శుభవార్త

JEE అడ్వాన్స్డ్ పరీక్షలను ఇకపై వరుసగా మూడేళ్లు రాయొచ్చు. ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే రాసేందుకు అవకాశం ఉండగా, 2025లో నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష నుంచి మూడు సార్లు అటెంప్ట్ చేయొచ్చని కేంద్రం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2023లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ సారి పరీక్ష రాయవచ్చని పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. 2000 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొంది.
Similar News
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<
News September 15, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.