News December 29, 2024
విద్యార్థులకు శుభవార్త

AP: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్ను నియమించామన్నారు. సింగరాయకొండలో SC, BC వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. ₹206 కోట్లతో 62 కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News September 24, 2025
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

AP: మన్యం, VZM, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ నెల 26న వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని తెలిపింది. అది 27న దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే ఛాన్సుందని తెలిపింది. ఈ సందర్భంగా కోస్తా జిల్లాల్లో 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
News September 24, 2025
ఇప్పటికే కొన్న OG టికెట్స్ పరిస్థితి ఏంటి?

TG: రేపు విడుదలకానున్న పవన్ OG మూవీ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు GOను <<17815121>>TG హైకోర్టు<<>> సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న తలెత్తింది. రేపటికి దాదాపుగా అన్ని షోలకు టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షో టికెట్ల డబ్బులు, అన్ని టికెట్లకు పెంచిన ధరలను రిఫండ్ చేస్తారా? లేదా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News September 24, 2025
BREAKING: రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.