News January 11, 2025
విద్యార్థులకు శుభవార్త: లోకేశ్

AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.
Similar News
News November 15, 2025
ప్రహరీ బయట మొక్కలను పెంచకూడదా?

పాదచారుల బాటపై 2, 3 వరుసల్లో మొక్కలు పెంచడం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పచ్చదనం పెంచడం మంచిదే అయినా, ఇది పాదచారుల కోసం వదలాల్సిన స్థలాన్ని ఆక్రమిస్తుందంటున్నారు. ‘ఆ ప్రదేశం దాటి వాహనాలు నిలిపితే దారి మూసుకుపోతుంది. ఇంటి ప్రాంగణంలోనే మొక్కలు పెంచి, బయట పాదబాటలను నిర్విఘ్నంగా ఉంచడం ద్వారా వాస్తు శుభాలు, సామాజిక శ్రేయస్సు రెండూ కలుగుతాయి’ అని ఆయన సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 15, 2025
OFFICIAL: CSK కెప్టెన్గా గైక్వాడ్

IPL 2026 కోసం CSK కెప్టెన్ను ఆ జట్టు యాజమాన్యం కన్ఫామ్ చేసింది. తదుపరి సీజన్కు తమ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఉంటారని X వేదికగా వెల్లడించింది. దీంతో సంజూ శాంసన్ను కెప్టెన్గా ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరదించినట్లైంది. CSK సంజూ శాంసన్ను తీసుకుని, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ను RRకు ఇచ్చి ట్రేడ్ డీల్ చేసుకున్న విషయం తెలిసిందే.
News November 15, 2025
CM పీఠంపై సందిగ్ధం.. రేపు MLAలతో నితీశ్ భేటీ

బిహార్ ఎన్నికల్లో NDA 202 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించింది. అయితే CM పదవిపై కూటమిలో ఇంకా సందిగ్ధతే ఉంది. ఈ తరుణంలో సీఎం పీఠాన్ని ఆశిస్తున్న నితీశ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ కానున్నారు. ‘CM పోస్టుకు వివాదరహిత వ్యక్తి నితీశ్ మాత్రమే అర్హుడు. బిహార్లో ప్రత్యామ్నాయం ఎవరూ లేరు’ అని JDU MLAలు పేర్కొంటున్నారు. కాగా ఫలితాల అనంతరం LJP నేత చిరాగ్ సహా అనేకమంది నితీశ్ నివాసానికి పోటెత్తారు.


