News March 22, 2025
విద్యార్థులకు గుడ్న్యూస్.. నిధుల విడుదల

AP: ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరో రూ.400కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకూ ఈ పథకానికి మెుత్తంగా రూ.788కోట్లు విడుదలయినట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
Similar News
News December 1, 2025
చలికాలం స్వెటరు వేసుకుని పడుకుంటున్నారా?

చలికాలం కొందరు స్వెటరు వేసుకుని పడుకుంటారు. అయితే దానికి బదులు కాటన్, లెనిన్, బ్రీతబుల్ దుస్తులు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ‘స్వెటరే వేసుకోవాలి అనుకుంటే టైట్గా ఉండేది వద్దు. దాంతో బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరగదు. కాస్త లూజ్గా, పొడిగా, బ్రీతబుల్, శుభ్రంగా ఉండేది వేసుకోండి. వింటర్లో కాళ్లకు సాక్సులు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అవి కూడా శుభ్రంగా, కాస్త లూజ్గా ఉండాలి’ అని చెబుతున్నారు.
News December 1, 2025
GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్

TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం త్వరలోనే గెజిట్ జారీ చేయనుంది. కాగా <<18393033>>ఈ విస్తరణతో<<>> 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
News December 1, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.


