News March 22, 2025

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదల

image

AP: ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరో రూ.400కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకూ ఈ పథకానికి మెుత్తంగా రూ.788కోట్లు విడుదలయినట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Similar News

News October 26, 2025

దేశం పరువును గంగలో కలిపారు.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

image

MPలో ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఘటన జరిగిందని, దేశం పరువును గంగలో కలిపారని అధికార BJPపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. CM బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని కావాలనే రాజకీయం చేస్తోందని BJP కౌంటర్ ఇచ్చింది. నిందితుడిపై తక్షణ చర్యలు చేపట్టామని, ఇలాంటి వాటిని సహించేదే లేదని స్పష్టం చేసింది.

News October 26, 2025

వైద్య సిబ్బంది 24hrs అందుబాటులో ఉండాలి: మంత్రి సత్యకుమార్

image

AP: మొంథా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వాతావరణ సూచనలతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్సులు, ఫీడర్ వెహికల్స్ మ్యాపింగ్ చేశామని వైద్యారోగ్య శాఖ CS సౌరభ్ గౌర్ తెలిపారు. ఎపిడమిక్ సెల్, ఎమర్జెన్సీ టీమ్‌లు సిద్ధం చేశామన్నారు.

News October 26, 2025

కరూర్ బాధితులను కలవనున్న విజయ్

image

TVK చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలను విజయ్ అక్టోబర్ 27న చెన్నై దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో కలవనున్నారు. ఇప్పటికే రిసార్ట్‌లో 50 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి విజయ్ పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బాధిత కుటుంబాలను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపాయి.