News October 25, 2024
టీమ్ ఇండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!

టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆయన 2 రంజీ మ్యాచ్లు ఆడతారని సమాచారం. కర్ణాటక, మధ్యప్రదేశ్తో జరిగే మ్యాచుల్లో ఆయన బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తారని టాక్. కాగా వన్డే వరల్డ్ కప్లో షమీ గాయపడి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు.
Similar News
News February 12, 2026
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,200 తగ్గి రూ.1,58,400కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 తగ్గి రూ.1,45,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 12, 2026
US, వెనిజులా ఆయిల్ కొనుగోళ్లు పెంచండి.. కేంద్రం ఆదేశం!

అమెరికా, వెనిజులా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు పెంచాలని IOC, BPCL, HPCL తదితర రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. ‘ట్రేడ్ డీల్లో భాగంగా ఎనర్జీ కొనుగోళ్లు పెంచాలని ఇండియా చూస్తోంది. రష్యా ఆయిల్ దిగుమతిని తగ్గించుకోనుంది. స్పాట్ మార్కెట్ టెండర్లలో US గ్రేడ్స్కు ప్రాధాన్యమివ్వాలని రిఫైనరీలను కోరింది. వెనిజులా ఆయిల్ను ట్రేడర్లతో ప్రైవేట్ చర్చల ద్వారా కొనాలని చెప్పింది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
News February 12, 2026
విటమిన్ Cతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

స్త్రీలకు విటమిన్ C ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇది సరిగ్గా లభించకపోతే స్త్రీలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. C విటమిన్తో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి, ప్రెగ్నెన్సీలో తీసుకుంటే శిశువులో పుట్టుకలోపాలు రాకుండా ఉంటాయి, ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల హార్మోన్ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉండవు. కాబట్టి ఇది తగినంత అందేలా చూసుకోవాలంటున్నారు.


