News December 5, 2024

శబరిమల వెళ్లే వారికి శుభవార్త

image

శబరిమల వెళ్లే వారి కోసం రైల్వే శాఖ మరో 28 ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 29 వరకు వివిధ తేదీల్లో నడిచే ఈ రైళ్లు మౌలాలి-కొల్లం, కాచిగూడ-కొట్టాయం, కాకినాడ-కొల్లం, నర్సాపూర్-కొల్లం మధ్య ఇరువైపులా తిరగనున్నాయి. డిసెంబర్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ రైళ్ల రిజర్వేషన్ బుకింగ్ అందుబాటులోకి రానుంది.

Similar News

News March 5, 2026

బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

image

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్‌ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్‌ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్‌’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.

News March 5, 2026

బెంగాల్ గవర్నర్ రాజీనామా.. మమత ఏమన్నారంటే?

image

బెంగాల్ గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడం షాక్‌కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘ఆయన రిజైన్ వెనుక కారణం తెలియదు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేసి ఉంటారు. ఎన్.రవిని WB గవర్నర్‌గా నియమిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో నాతో చర్చించలేదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి’ అని ట్వీట్ చేశారు.

News March 5, 2026

కడియంపై తీర్పు రిజర్వు చేసిన స్పీకర్

image

TG: MLAలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ విచారణ కొనసాగించారు. శ్రీహరికి సంబంధించి ఇరువర్గాల వాదనలు విన్న స్పీకర్ తీర్పును రిజర్వు చేశారు. కాగా BRS పిటిషన్‌పై సమాధానమిచ్చేందుకు కొంత సమయం కావాలని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు స్పీకర్‌ను కోరారు. మరోపక్క SC సూచనలతో కౌశిక్ రెడ్డి న్యాయవాదులు రాత పూర్వక వివరణను స్పీకర్‌కు అందించారు.