News September 7, 2024
ప్రభుత్వ కాలేజీల్లో చదివే వారికి గుడ్న్యూస్

TG: ప్రభుత్వ జూ.కాలేజీల్లో విద్యార్థులకు EAPCET, NEET, JEE వంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనుంది. రాష్ట్రంలోని 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, వాటిలో ఏటా 80వేల మంది ఫస్టియర్లో చేరుతున్నారు. వీరు EAPCETలో ఉత్తీర్ణత సాధించి బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరితే ప్రభుత్వం పూర్తి రీయింబర్స్మెంట్ చేస్తోంది.
Similar News
News October 18, 2025
ఈ పండ్లలో అధిక పోషకాలు

*ఆపిల్: ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
*అరటి- పొటాషియం, విటమిన్ B-6 వల్ల శక్తి అందుతుంది.
* జామ: విటమిన్ C, ఫైబర్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.
*ఆరెంజ్: విటమిన్ C వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
*దానిమ్మ, బొప్పాయి, కివీ, ఉసిరిలోనూ పోషకాలుంటాయి.
News October 18, 2025
గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాడండి: హరీశ్ రావు

TG: BC రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్, BJP గల్లీలో కాకుండా ఢిల్లీలో పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘కేంద్రంలో BJP, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఈ 2 పార్టీలు మద్దతిచ్చాక రిజర్వేషన్ల పెంపును ఆపేదెవరు? పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా BC రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి. ఏ పార్టీ బిల్లు పెట్టినా BRS మద్దతు ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
News October 18, 2025
మరో వివాదంలో యూసుఫ్ పఠాన్

Ex క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బెంగాల్లోని అదీనా మసీదుపై ఆయన చేసిన ట్వీట్ తాజాగా దుమారం రేపింది. ఇది అద్భుత కట్టడమని, సుల్తాన్ సికందర్ నిర్మించారని పోస్ట్ చేయడంపై BJP నేతలు మండిపడుతున్నారు. అది మసీదు కాదని, ఆదినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారని కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల <<17728883>>ప్రభుత్వ స్థలాన్ని<<>> ఆక్రమించారని ఆయనపై GJ హైకోర్టు సీరియస్ అవడం తెలిసిందే.