News November 28, 2024
RTC బస్సులు ఎక్కే వారికి శుభవార్త

AP: విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్, బెంగళూరు మధ్య తిరిగే డాల్ఫిన్, అమరావతి బస్సుల్లో రాయితీ అందిస్తున్నట్లు APSRTC ప్రకటించింది. చలికాలం కావడంతో AC బస్సులకు డిమాండ్ తగ్గడంతో ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఆదివారం మినహా మిగతా రోజుల్లో బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20శాతం, విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్ మధ్య నడిచే బస్సుల్లో 10శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
Similar News
News January 5, 2026
సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.
News January 5, 2026
J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్మన్

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్లోని కాన్స్టిట్యూషన్ క్లబ్ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.
News January 5, 2026
IPL ప్రసారంపై బ్యాన్.. బంగ్లా సంచలన నిర్ణయం

భారత్తో వైరం ముదరడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బ్యాన్ అమలు చేయాలని బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో KKR టీమ్ నుంచి ముస్తాఫిజుర్ను <<18748860>>తీసేయడంతో<<>> ఈ వివాదం చెలరేగింది. తాము T20 WC కోసం భారత్కు రాబోమని ICCకి BCB <<18761652>>లేఖ<<>> రాసింది. ఈక్రమంలోనే IPL ప్రసారంపై బ్యాన్ విధించింది.


