News August 3, 2024

రేషన్ షాపుల్లో మరిన్ని సరకులు: చంద్రబాబు

image

APలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో రేషన్ షాపుల్లో మరిన్ని సరకులు తక్కువ ధరకు అమ్మాలని CM సూచించారు. TDP హయాంలో రేషన్‌లో ఇచ్చిన సరకులను మళ్లీ పునరుద్ధరించాలని చెప్పారు. వ్యవసాయ, సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Similar News

News December 4, 2025

NGKL: రోడ్డు ప్రమాదంలో హోటల్ యజమాని మృతి

image

కల్వకుర్తి పట్టణంలోని ప్రశాంత్ హోటల్ యజమాని అక్కి శ్రీనివాసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో ప్రశాంత్ హోటల్ పేరుతో ఫేమస్ అయ్యాడు.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్‌ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.