News October 30, 2024

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

AP: రద్దీగా ఉండే రైలు జనరల్ బోగీల్లో ఎక్కాలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సిందే. తోపులాటలు, వాగ్వాదాలు, ఘర్షణలు సర్వసాధారణం. వీటికి చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ప్రయాణికులు ప్రశాంతంగా రైలు ఎక్కేలా రైల్వే స్టేషన్లలో జనరల్ బోగీలు ఆగేచోట ప్లాట్‌ఫామ్‌లపై క్యూలు ఏర్పాటు చేస్తోంది. తొలుత విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

Similar News

News February 5, 2026

వెస్ట్ బైపాస్ నుంచే వెళ్లండి.. జగన్‌కు నోటీసులు

image

AP: రేపు వైసీపీ అధినేత జగన్ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ పర్యటనపై పోలీసులు తాజాగా జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెస్ట్ బైపాస్ రోడ్డులో వెళ్లాలని పేర్కొన్నారు. ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా బుధవారం జగన్ గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.

News February 5, 2026

ఖర్జూరంతో ఆరోగ్యంగా వెయిట్ లాస్‌.. కారణమిదే!

image

* ఖర్జూరాలను బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.
* ఎక్కువ సమయం ఆకలి వేయదు.
* ఒకటి/రెండు తినే సరికి స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఆకలి తక్కువ వేస్తుంది.
* ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్ల కారణంగా జీవక్రియ మెరుగుపడుతుంది.
* తక్కువ క్యాలరీలు తీసుకోవడంతో హెల్తీగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

News February 5, 2026

రైతులకు రిటర్న్ ప్లాట్‌లు.. 16న లాటరీ

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 16న ప్లాట్‌ల కేటాయింపునకు CRDA లాటరీ తీయనుంది. ఈ-లాటరీ ద్వారా రైతులకు నిబంధనల ప్రకారం ప్లాెెట్‌లు కేటాయిస్తారు. వాటిని రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.