News August 31, 2024

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోయే వారికి GOOD NEWS

image

వీకెండ్‌(శని, ఆదివారం)లో ఎక్కువ సేపు నిద్రపోవడం చాలా మందికి అలవాటు. అలాంటి వ్యక్తుల్లో గుండె జబ్బుల ముప్పు 20% తగ్గుతుందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనం వెల్లడించింది. 14 ఏళ్లపాటు 91వేల మంది డేటాను పరిశీలించి ఈ వివరాలు తెలిపింది. ‘మనిషికి 6-7గంటల నిద్ర అవసరం. కానీ పని ఒత్తిడితో నాణ్యమైన నిద్ర దొరకట్లేదు. వారంతంలో దాన్ని భర్తీ చేయడం వల్ల హార్ట్ అటాక్ ముప్పు తగ్గుతుంది’ అని పేర్కొంది.

Similar News

News November 28, 2025

బీసీ రిజర్వేషన్లు పెంపులో జగిత్యాల రెండో స్థానం

image

ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి. ఇందులో 1వ స్థానంలో హనుమకొండ ఉండగా.. 2వ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. 2019 ఎన్నికల్లో 25.07 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లు 2025లో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 27.19 శాతానికి పెరిగి, గతంలో కంటే ప్రస్తుతం 2.12 శాతం బీసీ రిజర్వేషన్లు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

News November 28, 2025

రూ.2.4 కోట్లు పలికిన కరీంనగర్ క్రికెటర్

image

అంతర్జాతీయ మహిళా వెటరన్ క్రికెటర్, KNRకు చెందిన శిఖాపాండే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ఏకంగా రూ. 2.4కోట్లు దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేలంలో 36 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను బేస్ ధర రూ.40 లక్షలు కాగా, UP వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. రామగుండం NTPC ఉద్యోగి కుమార్తె అయిన శిఖాపాండే రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నా, కోట్లు పలకడం మహిళల క్రికెట్ ఆదరణకు నిదర్శనం.

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్