News December 10, 2024
శబరిమల వెళ్లే మహిళలకు గుడ్న్యూస్

శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.
Similar News
News January 29, 2026
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’: CM CBN

AP: ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన ‘<<18580194>>సంజీవని<<>>’ ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై ఆరా తీశారు.
News January 29, 2026
దూబే ‘బ్యాడ్ లక్’.. లేదంటేనా!

NZతో 4వ T20లో IND బ్యాటర్ దూబే దురదృష్టకర రీతిలో ఔటయ్యారు. స్ట్రైక్లో ఉన్న హర్షిత్ బంతిని స్ట్రెయిట్గా ఆడటంతో అది బౌలర్ చేతికి తగిలి వికెట్లకు తాకింది. దీంతో నాన్స్ట్రైక్ ఎండ్లో క్రీజు బయటకొచ్చిన దూబే రనౌటయ్యారు. 15 బంతుల్లో 50, మొత్తం 23 బంతుల్లో 65 రన్స్ చేసిన దూబే ఇంకాసేపు క్రీజులో ఉండుంటే IND గెలిచేదేమో. కాగా T20Isలో IND తరఫున ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. TOP2లో యువీ(12), అభి(14) ఉన్నారు.
News January 29, 2026
పిల్లలకు SM బ్యాన్పై విధివిధానాలు రూపొందించండి: మంత్రి లోకేశ్

AP: మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయంపై విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై మంత్రులతో జరిగిన మీటింగ్లో చర్చించాం. చిన్నారులకు SMను నిషేధించే అంశంపై సింగపూర్, AUS, మలేషియా, ఫ్రాన్స్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, ఫేక్ పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించా’ అని ట్వీట్ చేశారు.


