News June 24, 2024
గుడ్న్యూస్.. మళ్లీ పట్టాలెక్కనున్న జన్మభూమి ఎక్స్ప్రెస్

విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా రద్దు చేసిన పలు రైళ్లలో కొన్నింటిని పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 25 నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్(విశాఖ-లింగంపల్లి) అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో పాటు VJA- కాకినాడ పోర్టు, చెంగల్పట్టు- కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లను పునరుద్ధరించినట్లు పేర్కొంది. అలాగే పలు స్పెషల్ రైళ్లను మరికొన్నాళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News November 1, 2025
నేడు లండన్ వెళ్లనున్న సీఎం దంపతులు

AP: CM చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇవాళ లండన్ వెళ్లనున్నారు. ఈనెల 4న ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ <<17985147>>అవార్డును<<>> అందుకోనున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ భువనేశ్వరి స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరిగే CII సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఈనెల 6న తిరిగి అమరావతి చేరుకుంటారు.
News November 1, 2025
ఈ కోళ్లు రోజూ గుడ్లు పెడతాయని తెలుసా?

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 1, 2025
పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? థైరాయిడ్ కావొచ్చు

ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. పిల్లల్లో ఈ సమస్యను నివారించాలంటే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పిల్లలు అలసిపోయినట్లు అనిపించడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, చర్మం, పొడిగా, నిర్జీవంగా మారడం, మలబద్ధకం, అజీర్ణం, థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం, కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.


