News March 24, 2025
GOOD NEWS: అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయ్

AP: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు రూ.6,200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవాళ ఉ.11.30 గంటల నుంచి వారి ఖాతాల్లో GLI, GPF, CPS తదితర మొత్తాలను జమ చేస్తోంది. ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు క్రెడిట్ అవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. బకాయిల విడుదలకు CM చంద్రబాబు ఈ నెల 20న ఆదేశించారు. మరుసటి రోజే జమ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో కాస్త ఆలస్యమైంది.
Similar News
News November 11, 2025
‘రాజాసాబ్’.. ప్రభాస్ సూపర్ లుక్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్గా కనిపిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.
News November 11, 2025
ముంబై ఆ ఇద్దరిని వదిలేయాలి: హెడెన్

IPL రిటెన్షన్స్ ప్రకటనకు ముందు ముంబై ఇండియన్స్కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ కీలక సూచనలు చేశారు. గత వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసిన బౌల్ట్(₹12.5Cr), దీపక్ చాహర్(₹9.25Cr)ను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ వదిలేస్తే పర్స్ ఎక్కువగా మిగులుతుందని, టీమ్ బెంచ్ స్ట్రెంత్ను స్ట్రాంగ్ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వారిని మళ్లీ తక్కువ ధరకు మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
News November 11, 2025
ఆరా మస్తాన్ సర్వే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్దే!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్కు 47.49%, BRSకు 39.25%, BJPకి 9.31% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, నాగన్న సర్వే తదితర ఎగ్జిట్ పోల్స్ సైతం హస్తం పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. మరి మీరు ఏ పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. కామెంట్ చేయండి.


