News January 6, 2025
గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 8న చర్లపల్లి-శ్రీకాకుళం, 9న శ్రీకాకుళం-చర్లపల్లి మధ్య రైళ్లు నడవనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఈ నెల 11, 15 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం, 12, 16వ తేదీల్లో శ్రీకాకుళం-కాచిగూడ మధ్య ట్రైన్స్ నడపనున్నట్లు పేర్కొంది.
Similar News
News November 8, 2025
ధ్రువ్ జురెల్ మరో సెంచరీ

సౌతాఫ్రికా-Aతో జరుగుతోన్న రెండో అన్అఫీషియల్ టెస్టులో ఇండియా-A బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 132* రన్స్ చేసిన ఆయన, సెకండ్ ఇన్నింగ్స్లోనూ సెంచరీ బాదారు. తొలి ఇన్నింగ్స్లో IND-A 255, SA-A 221 స్కోర్ చేశాయి. రెండో ఇన్నింగ్స్లో ప్రస్తుతం భారత్ స్కోర్ 355-6గా ఉంది. జురెల్ (117*), పంత్ (48*) క్రీజులో ఉన్నారు.
News November 8, 2025
48 మంది ఎమ్మెల్యేలపై CBN సీరియస్

AP: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులతో సమావేశం సందర్భంగా ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, MLAలు పాల్గొనాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.
News November 8, 2025
వివేకా హత్య కేసు.. ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు

AP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. రాజుపాలెం పీఎస్ ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారని పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


