News March 28, 2025
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై శుభవార్త

TG: గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇంటి స్థలం లేని అర్హులకు వాటిని కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తిచేసుకునేలా ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్మెంట్ పూర్తిచేసిన వారికి తొలి విడత రూ.లక్ష చెల్లించాలని సూచించారు.
Similar News
News January 18, 2026
ఇతిహాసాలు క్విజ్ – 127 సమాధానం

ఈరోజు ప్రశ్న: మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి కూడా, పాండవుల విజయాన్ని కోరుకున్నది ఎవరు?
సమాధానం: కురుక్షేత్రంలో కౌరవుల సైన్యాధిపతిగా ఉన్న భీష్ముడు పాండవుల విజయాన్ని కోరుకున్నారు. ధర్మం పాండవుల వైపే ఉందని ఆయనకు తెలుసు. అందుకే, తనను ఎలా ఓడించాలో స్వయంగా పాండవులకే రహస్యాన్ని చెప్పి, వారు విజయం సాధించేలా సహకరించారు. ఆయనతో పాటు విదురుడు కూడా పాండవ పక్షపాతిగా ఉండేవారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 18, 2026
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది: హరీశ్రావు

TG: రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉందని మాజీమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి, ప్రజాద్రోహం కలిస్తే రేవంత్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ CMగా ఉంటూ కేంద్రంలోని BJPతో చీకటి స్నేహం చేస్తున్నారు. ఆ పార్టీ శత్రువులైన BJP, TDP కూటమికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజకీయ యాత్ర CBN కనుసన్నల్లో సాగుతోంది. హింసను ప్రేరేపించేలా CM చేసిన కామెంట్లపై డీజీపీ ఏ చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
News January 18, 2026
25న తిరుమలలో రథసప్తమి

సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25న తిరుమలలో రథసప్తమి నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారని చెప్పింది. 5.30AM నుంచి 9PM వరకు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. పవిత్ర మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి/మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది.


