News January 10, 2025
కరెంటు ఛార్జీలపై శుభవార్త

AP: 2025-26 ఏడాదికి ప్రజలపై కరెంటు ఛార్జీల భారం ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ శుభవార్త చెప్పారు. రూ.14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా రాయితీలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో కరెంటు ఛార్జీలు పెంచొద్దని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
ప్రభాస్ ‘రాజాసాబ్’కు దారుణమైన కలెక్షన్లు

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న దేశవ్యాప్తంగా థియేటర్లలో రూ.0.48 కోట్లు(15%- థియేటర్ ఆక్యుపెన్సీ) వసూలు చేసిందని sacnilk తెలిపింది. తొలి వారం రూ.130 కోట్ల(నెట్) కలెక్ట్ చేయగా 13 రోజుల్లో మొత్తంగా రూ.141.98 కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటివరకు ఈ మూవీ 55శాతమే రికవరీ చేసిందని సినీ వర్గాలు తెలిపాయి.
News January 22, 2026
NALCOలో 110 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<
News January 22, 2026
గురు గ్రహ బలం పెంచుకోవాలంటే..?

గురు గ్రహ బలం పెంచుకోవాలంటే మహిళలు పుట్టింటి నుంచి తెచ్చిన దీపపు కుందులతో నిత్యం దీపారాధన చేయాలి. చీమలు ఎక్కువగా ఉన్న చోట చక్కెరను ఆహారంగా చల్లాలి. సాధువులకు నెయ్యి దానం చేయడం శుభప్రదం. ఇంటికి పడమర దిశలోని శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యం దానమివ్వాలి. ఇంటి ఈశాన్యంలో 9 వత్తుల నేతి దీపం వెలిగించాలి. గురుస్తోత్రం పఠించడం మరింత శ్రేష్ఠం. వేంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల గురు గ్రహ బలం చేకూరుతుంది.


