News April 4, 2024
ఉద్యోగాల భర్తీపై గుడ్న్యూస్!

TG: జాబ్ నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు TSPSC చర్యలు తీసుకుంటోంది. జిల్లా స్థాయి ఉద్యోగాలను 1:3 నిష్పత్తిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రూప్-4 ఉద్యోగాలకూ ఇదే ఫార్ములాను అనుసరించనుందట. ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని భావిస్తోందట. జోనల్, మల్టీజోనల్ స్థాయి పోస్టులను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారని సమాచారం.
Similar News
News November 28, 2025
పాకిస్థానీలకు వీసాలు నిలిపేసిన యూఏఈ!

పాకిస్థానీలకు వీసాలు జారీ చేయడాన్ని UAE నిలిపేసింది. అక్కడికి వెళ్తున్న చాలా మంది నేర కార్యకలాపాలలో భాగమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సెనేట్ ఫంక్షనల్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ సమావేశంలో పాక్ అధికారి సల్మాన్ చౌధరి చెప్పారు. పాక్ పాస్పోర్టులను నిషేధించడం ఒక్కటే తక్కువని అన్నారు. బ్యాన్ చేస్తే పరిస్థితి దిగజారుతుందని తెలిపారు. ఇప్పటికే జారీ చేసిన వీసాలు గడువు ముగిసే దాకా చెల్లుతాయి.
News November 28, 2025
‘దిత్వా’ తుఫాను పయనం ఇలా..

AP: నైరుతి బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి 120KM, పుదుచ్చేరికి 520KM, చెన్నైకి ఆగ్నేయంగా 620KM దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 13KM వేగంతో కదిలిందని చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వివరించింది.
News November 28, 2025
తిరుపతిలో 600 ఎకరాల్లో ధార్మిక టౌన్షిప్

AP: తిరుపతిలో డెల్లా గ్రూప్ వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ నిర్మించబోతోంది. 600 ఎకరాల ప్రైవేటు భూముల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సహాయసహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్ని కోరారు. ఈ టౌన్షిప్ రూ.3 వేల కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని, సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని మంత్రి అనగాని వారికి హామీ ఇచ్చారు.


