News June 23, 2024
GOOD NEWS: తగ్గనున్న ఉల్లి ధరలు
దేశంలో పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 71వేల టన్నుల ఆనియన్స్ను కొనుగోలు చేసింది. దశలవారీగా ఈ ఏడాది 5 లక్షల టన్నులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రస్తుతం కేజీ రూ.40-50 మధ్య ఉన్న ధర క్రమంగా తగ్గుతుందని వినియోగవ్యవహారాల శాఖ అంచనా వేసింది. ఎండ తీవ్రత, వర్షాలు తక్కువగా ఉండటంతో రబీలో దిగుబడి తగ్గడం వల్ల ఉల్లి ధరలు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News October 9, 2024
వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదు: మంత్రి అనిత
AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.
News October 9, 2024
CM రేవంత్రెడ్డిని కలిసిన BRS MLA మల్లారెడ్డి
TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.
News October 9, 2024
J&K ప్రజలకు కృతజ్ఞతలు: రాహుల్ గాంధీ
జమ్మూకశ్మీర్లో తమ కూటమి సాధించిన గెలుపు రాజ్యాంగ విజయంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. విజయాన్ని అందించిన J&K ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. హరియాణాలో వచ్చిన ఊహించని ఫలితాలపై విశ్లేషిస్తున్నామని తెలిపారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని ట్వీట్ చేశారు.