News July 26, 2024

గుడ్‌న్యూస్.. వారికి ఏడాదికి రూ.12,000

image

TG: భూమిలేని రైతుకూలీల ఆర్థిక, జీవన పరిస్థితులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిన్న బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. వారికి ఏటా రూ.12వేలు ఇస్తామని, ఆ బృహత్ కార్యక్రమాన్ని ఈఏడాదే ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలో చేరాలని నిర్ణయించినట్లు చెప్పారు. రైతుల తరఫున మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

Similar News

News January 20, 2026

రిపబ్లిక్ వేడుకలకు సీఎం రేవంత్ దూరం

image

TG: CM రేవంత్ రెడ్డి రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావడం లేదు. JAN 25 నుంచి 30 వరకు USలోని హార్వర్డ్ వర్సిటీలో లీడర్‌షిప్ శిక్షణ తరగతులకు ఆయన హాజరవుతారు. JAN 23న దావోస్ పర్యటన ముగిసిన వెంటనే, ఆయన అమెరికా వెళ్లి కొంతమంది పారిశ్రామికవేత్తలను కలుస్తారు. తర్వాత యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యమంత్రి లేకుండానే ప్రసంగిస్తారు.

News January 20, 2026

పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

image

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.

News January 20, 2026

జపాన్ వినూత్న పద్ధతి.. రైతును గౌరవించేలా!

image

జపాన్‌లో కూరగాయలు, పండ్ల ప్యాకెట్లపై వాటిని పండించిన రైతు ఫొటోను ముద్రిస్తారు. దీనిని ‘కావో నో మియెరు యసాయి’ అంటారు. 1970లో ప్రారంభమైన ఈ విధానం వల్ల తాము తినే ఆహారం ఎవరి కష్టం ద్వారా వచ్చిందో వినియోగదారులకు తెలుస్తుంది. ఇది రైతు శ్రమకు గుర్తింపునివ్వడమే కాకుండా కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. దీని వల్ల రైతుకు, కొనే వ్యక్తికి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇలాంటి విధానం మన దగ్గరా ఉండాలా? COMMENT