News January 2, 2025
GOOD NEWS: వారికి రూ.20,000

AP: మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేట నిలిచిన సమయంలో గత ప్రభుత్వం రూ.10వేలు ఇస్తే తాము రూ.20 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.
Similar News
News January 11, 2026
‘హిజాబ్ పీఎం’ వ్యాఖ్యలు.. ఒవైసీ vs హిమంత!

హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<18819394>>వ్యాఖ్యలపై<<>> మాటల యుద్ధం జరుగుతోంది. ‘ఎవరైనా PM కావచ్చు. కానీ ఇది హిందూ దేశం. హిందూ వ్యక్తే PMగా ఉంటారని మేం నమ్ముతాం’ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. దీంతో హిమంత తలలో ట్యూబ్ లైట్ ఉందని ఒవైసీ ఎద్దేవా చేశారు. దేశం ఏ ఒక్క కమ్యూనిటీకి సొంతం కాదనే రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
News January 11, 2026
మరణించిన వారిని దూషిస్తే..?

మరణించిన వ్యక్తిని నిందించినా, దూషించినా, అవమానించినా శాస్త్రాల ప్రకారం నేరం. మనుస్మృతి, భారతంలోని శాంతి పర్వం ప్రకారం.. వారు తిరిగి సమాధానం చెప్పలేరు కాబట్టి వారి గురించి చెడుగా మాట్లాడటం పిరికిపంద చర్యగా పేర్కొంటారు. ఇలా చేస్తే మనలోని సానుకూల శక్తి నశించి, ప్రతికూలత పెరుగుతుంది. మరణించిన వారు చేసిన తప్పుల కంటే వారిలోని మంచిని మాత్రమే గుర్తుంచుకోవాలి. లౌకిక బంధాలు ముగిసిన వారు దైవంతో సమానం.
News January 11, 2026
714 పోస్టులు.. అప్లై చేశారా?

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్సైట్: https://dsssbonline.nic.in.


