News May 15, 2024

క్రికెట్ అభిమానులకు గుడ్&బ్యాడ్‌న్యూస్

image

T20WC 2వ సెమీఫైనల్ వెస్టిండీస్‌లోని గయానాలో జరగనుంది. ఒకవేళ ఇండియా సెమీస్ చేరితే జూన్ 27న గయానాలో ఆడనుంది. అక్కడ 10.30amకి మ్యాచ్ ప్రారంభమైతే మన దగ్గర 8pm అన్నమాట. ఇండియాలోని ప్రేక్షకులు మ్యాచ్ వీక్షించేందుకు సమయం అనువుగా ఉండేందుకే రెండో సెమీఫైనల్‌లో భారత్‌కు అవకాశం ఇచ్చినట్లు espncricinfo తెలిపింది. అయితే.. రెండో సెమీఫైనల్‌కు <<13248114>>రిజర్వ్ డే<<>> లేకపోవడం ఆందోళన కలిగించే అంశం.

Similar News

News March 13, 2026

పంట రుణాల పరిమితి ఖరారు

image

TG కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ FY2026-27కి గాను పంట రుణాల పరిమితిని ఖరారు చేసింది. ఎకరా వరి సాధారణ సాగుకు ₹48,000, SRIకి ₹38K, విత్తనోత్పత్తికి ₹51K, పత్తి(నీటి వసతి) ₹52K, వర్షాధారం ₹50K, విత్తనోత్పత్తికి ₹1.50Lగా నిర్ణయించింది. మిరప(సాధారణ సాగు) ₹90K, మల్చింగ్ ₹లక్ష, మొక్కజొన్న(₹38K, ₹32K, స్వీట్‌కార్న్ ₹43K), కంది(₹27K, ₹23K, ₹25K), పసుపు ₹92K, టమాటా ₹58K, ఉల్లి ₹49K, పెసలు (₹20K, ₹22K)గా ఉంది.

News March 13, 2026

డాల్బీ ఫార్మాట్‌లో ‘పెద్ది’

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అడ్వాన్స్‌డ్ డాల్బీ ఫార్మాట్‌లో విడుదల(ఏప్రిల్ 30) కానున్న తొలి టాలీవుడ్ మూవీగా నిలవనుంది. దీంతో హైపర్ రియలిస్టిక్ వీడియో, అద్భుతమైన సౌండ్‌తో చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు వార్-2, కాంతార-2, GOAT చిత్రాలు రిలీజయ్యాయి.

News March 13, 2026

8th క్లాస్‌తోనే ఐటీఐ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: 8వ తరగతిలోనే చదువు ఆపేసిన వారు జీవితంలో ఎదిగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8th క్లాస్ పాసైన వారూ ITI కోర్సుల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని HRD శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వారు ఇక్కడ చదువుతూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో టెన్త్ పాసయ్యేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే వృత్తి పనులు చేస్తున్నవారి స్కిల్స్ పరీక్షించి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు.