News June 3, 2024

క్రికెట్‌కు కేదార్ గుడ్‌బై

image

టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్ క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. టీమ్ ఇండియా తరఫున ఆయన 73 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడారు. ఐపీఎల్‌లో ఢిల్లీ, కొచ్చి, RCB, హైదరాబాద్‌, చెన్నైకి ప్రాతినిధ్యం వహించారు.

Similar News

News October 10, 2024

APకి రూ.7,211 కోట్లు, TGకి రూ.3,745 కోట్లు

image

OCT నెలకుగాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ ₹89,086crతో కలిపి మొత్తం ₹1,78,173crను పంపిణీ చేసింది. అత్యధికంగా UPకి ₹31,962cr, బిహార్‌కు ₹17,921cr, MPకి ₹13,987cr అందించింది. ఇక APకి ₹7,211cr, TGకి ₹3,745cr రిలీజ్ చేసింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి ఈ సాయాన్ని అందించినట్లు పేర్కొంది.

News October 10, 2024

కమిన్స్ వల్లే వారిద్దరూ రాణిస్తున్నారు: పాక్ మాజీ క్రికెటర్

image

SRH ఆటగాళ్లు అభిషేక్, నితీశ్ భారత్‌కు రాణించడం వెనుక ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ పాత్ర ఉందని పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నారు. ‘వారిద్దరికీ IPLలో కమిన్స్ ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదు. NKRను మిడిల్ ఆర్డర్‌లో పంపడం, కీలక ఓవర్లలో బౌలింగ్ ఇవ్వడం, శర్మని ఓపెనర్‌గా కొనసాగించడం వరకు ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు’ అని పేర్కొన్నారు. బంగ్లాతో నిన్నటి మ్యాచ్‌లో నితీశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగారు.

News October 10, 2024

త్వరలోనే వైసీపీ దుకాణం శాశ్వతంగా మూత: ఎమ్మెల్యే జీవీ

image

AP: మాజీ సీఎం జగన్ గుడ్ బుక్ రాస్తామంటున్నారని, ఆయన చేసిన పాపాలకు రామకోటి రాసుకుంటే పుణ్యం వస్తుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఆయనకు కలలో కూడా లోకేశ్ రెడ్ బుక్కే తిరుగుతున్నట్లు ఉందని సెటైర్లు వేశారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ జగనే అన్నారు. త్వరలోనే ఆ పార్టీ దుకాణం శాశ్వతంగా మూతపడటం ఖాయమని జోస్యం చెప్పారు.