News August 15, 2024

భారత్‌ కోసం గూగుల్ ప్రత్యేక డూడుల్

image

భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గూగుల్ తమ హోం పేజీని ప్రత్యేక డూడుల్‌తో అలంకరించింది. ఫ్రీలాన్స్ ఆర్ట్ డైరెక్టర్ వృందా జవేరీ దీన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు త్రివర్ణాలతో వేడుకలు చేసుకుంటారని, ఈ సందర్భంగా వారసత్వ నిర్మాణశైలిని ప్రతిబింబించేలా పలు వర్ణాలతో డూడుల్‌ని తీర్చిదిద్దామని గూగుల్ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో డూడుల్‌ను ఏర్పాటు చేస్తుంటుంది.

Similar News

News November 1, 2025

ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

image

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్‌తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.

News November 1, 2025

కాశీబుగ్గ ఘటన.. మృతులు వీరే

image

AP: 1.ఏడూరి చిన్నమ్మి(50)-రామేశ్వరం(టెక్కలి), 2.రాపాక విజయ(48)-పిట్టలసరి(టెక్కలి), 3.మురిపింటి నీలమ్మ(60)-దుక్కవానిపేట-పల్లిఊరు(వజ్రపుకొత్తూరు), 4.దువ్వు రాజేశ్వరి(60)-బెలుపతియా(మందస), 5.చిన్ని యశోదమ్మ(56)-శివరాంపురం(నందిగం), 6.రూప-గుడ్డిభద్ర(మందస), 7.లోట్ల నిఖిల్(13)-బెంకిలి(సోంపేట), 8.డొక్కర అమ్ముదమ్మ-పలాస, 9.బోర బృందావతి(62)- మందస. మరో వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందగా వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

చంద్రబాబువి పిట్టలదొర మాటలు: జగన్

image

AP: తుఫాను నిర్వహణపై CM చంద్రబాబువి పిట్టలదొర మాటలని YCP చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. ‘వైపరీత్యాల వేళ రైతులకు శ్రీరామరక్షగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం బెటర్ మేనేజ్‌మెంట్ అవుతుందా? మొంథా తుఫాను వల్ల నష్టపోయిన బీమాలేని రైతులకు దిక్కెవరు? మీ 18నెలల కాలంలో 16సార్లు వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే రూ.600CR ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్కపైసా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు’ అని ఆరోపించారు.