News March 13, 2025
మహిళా ఎస్సైపై దాడి చేసిన ఆకతాయిలు

AP: విజయనగరం జిల్లాలో అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై ఆకతాయిలు దాడి చేశారు. వేపాడ మండలంలో జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసభ్యంగా డాన్స్ చేశారు. దీనిని మహిళా ఎస్సై అడ్డుకోవడంతో ఆమెను జుట్టు పట్టుకొని లాగారు. అనంతరం ఆమెపై దాడిచేసి తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్నపోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. మహిళా ఎస్సైని ఆసుపత్రికి తరలించారు
Similar News
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <
News December 10, 2025
IISERBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( <
News December 10, 2025
పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.


