News May 23, 2024

సీఈఓగా రూ.166కోట్ల జీతం తీసుకున్నారు!

image

భారత ఐటీ రంగంలో అత్యధిక జీతం అందుకున్న సీఈఓగా థియరీ డెలాపోర్టే నిలిచారు. విప్రోకు సీఈఓగా ఉన్నప్పుడు ఈయన FY24లో రూ.166కోట్ల జీతం తీసుకున్నారు. ఇటీవల సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న డెలాపోర్టే పరిహారంగా రూ.92కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. ఆ స్థానాన్ని శ్రీనివాస్ పల్లియా (రూ.50కోట్ల జీతం) భర్తీ చేశారు. మరోవైపు ఇన్ఫోసిస్ CEO సాలిల్ పరేఖ్ రూ.56కోట్లు, HCL టెక్ సీఈఓ విజయకుమార్ రూ.28.4కోట్లు ఆర్జించారు.

Similar News

News November 25, 2025

కృష్ణా: MLAలకు తలనొప్పిగా మారిన జిల్లాల పునర్విభజన

image

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.

News November 25, 2025

కృష్ణా: MLAలకు తలనొప్పిగా మారిన జిల్లాల పునర్విభజన

image

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.

News November 25, 2025

విశాఖకు రావాలనే ప్రయత్నమే ఆమె కొంప ముంచిందా?

image

విజయవాడలో APMIDO GM సూర్యకళను ACB అరెస్టు చేయడంపై రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో ఆమె VZM ఆర్డీవోగా, సింహాచలం EOగా పని చేశారు. అప్పట్లోనూ ఆమెపై అవినీతి ఆరోపణలొచ్చాయి. కాగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న విశాఖ RDO పదవికి సూర్యకళ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్టవడం అనుమానాలకు తావిస్తోంది. వ్యతిరేకవర్గం ఆమెపై ఆధారాలతో ACBకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.