News November 9, 2024

మీ ఇంటికి సర్వే స్టిక్కర్ అంటించారా?

image

TG: కులగణనలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది 2 రోజులుగా రాష్ట్రంలోని ఇళ్లకు సర్వే స్టిక్కర్లు అంటించారు. ఇవాళ్టి నుంచి ఆ ఇళ్లకు వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. అయితే HYDతో సహా పలు పట్టణాలు, గ్రామాల్లో కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదు. దీంతో తమ వివరాలను నమోదు చేస్తారా? లేదా? అని ప్రజలు అయోమయంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరి మీ ఇంటికి స్టిక్కర్ అంటించారా? కామెంట్ చేయండి.

Similar News

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన యూపీ మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

News November 11, 2025

కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి CBI నోటీసులు

image

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి CBI నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈనెల 13, లేదా 15న విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కల్తీకి సంబంధించి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు.

News November 11, 2025

మరో భారీ ఎన్‌కౌంటర్

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్‌లో భద్రతా బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కీలక మావోయిస్టును బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.