News September 3, 2025

పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు ప్రభుత్వం ఆమోదం: TPSA

image

TG: గ్రామ పంచాయతీలను గ్రేడింగ్ చేసి క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు (TPSA) పి.మధుసూదన్ వెల్లడించారు. పంచాయతీ సెక్రటరీల పదోన్నతులకు అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News September 5, 2025

ఏయూకు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో 4వ స్థానం

image

AP: స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ విభాగంలో 23వ స్థానానికి చేరుకుంది. ఏయూ ఫార్మసీ కాలేజీ 31, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ 88వ స్థానంలో, డాక్టర్ BR అంబేడ్కర్ న్యాయ కళాశాల 16వ స్థానంలో నిలిచాయి. AU నాలుగో స్థానంలో నిలవడం పట్ల మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు.

News September 5, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రేపు ఉదయం 8.30 గంటల్లోపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, KNR, జగిత్యాల, సిరిసిల్ల, PDPL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, MHBD, WGL, HNK, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డికి IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 4, 2025

టెక్ దిగ్గజాలకు ట్రంప్ డిన్నర్.. మస్క్‌కు నో ఎంట్రీ

image

టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ కంపెనీల ఫౌండర్లు, CEOలకు US అధ్యక్షుడు ట్రంప్ ఈ రాత్రికి డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి బిల్‌గేట్స్, టిమ్ కుక్, జుకర్‌బర్గ్, పిచాయ్, సత్య నాదెళ్ల, ఆల్ట్‌మన్ తదితరులు హాజరుకానున్నారు. అయితే మస్క్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. ట్రంప్ అధికారం చేపట్టాక ఆయనకు కీలక పదవి ఇవ్వగా, తర్వాత ఇద్దరికీ చెడింది. దీంతో మస్క్‌ను ట్రంప్ దూరం పెడుతూ వస్తున్నారు.