News February 27, 2025

స్కీముల కోసం ఆలయాలను డబ్బు అడిగిన ప్రభుత్వం

image

సుఖ్ అభయ్ స్కీముకు ఆలయాలు నిధులు అందించాలంటూ హిమాచల్ ప్రదేశ్ జిల్లా యూనిట్లు కోరడం వివాదాస్పదంగా మారింది. OPS, ఫ్రీబీస్ సహా అప్పుల పాలవ్వడంతో అక్కడి ఖజానా ఒట్టిపోయింది. నిధుల కొరత వల్ల తమ పరిధిలోని 35 మందిరాల నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆలయాల డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తూ BJP ఆందోళనకు దిగడంతో CM సుఖ్వీందర్ సింగ్‌కు ఏం చేయాలో తోచడం లేదు. మీ కామెంట్?

Similar News

News November 9, 2025

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్ <<>>మంగళగిరి 10 నాన్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం హార్డ్ కాపీని డిసెంబర్ 10 వరకు పంపాలి. సీనియర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, బయో మెడికల్ ఆఫీసర్, లా ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in

News November 9, 2025

అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

image

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.

News November 9, 2025

షట్‌డౌన్ ఎఫెక్ట్: 1,460 విమానాల రద్దు

image

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఎఫెక్ట్ విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. రెండో రోజు ఏకంగా 1,460 విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి. మరో 6 వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. తొలి రోజు 1,025 విమానాలు రద్దు కాగా, 7 వేలకు పైగా డిలే అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భద్రతా సమస్యల కారణంగా 40 మేజర్ ఎయిర్ పోర్టుల్లో 4 శాతం డైలీ సర్వీసులను క్యాన్సిల్ చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది.