News February 27, 2025

స్కీముల కోసం ఆలయాలను డబ్బు అడిగిన ప్రభుత్వం

image

సుఖ్ అభయ్ స్కీముకు ఆలయాలు నిధులు అందించాలంటూ హిమాచల్ ప్రదేశ్ జిల్లా యూనిట్లు కోరడం వివాదాస్పదంగా మారింది. OPS, ఫ్రీబీస్ సహా అప్పుల పాలవ్వడంతో అక్కడి ఖజానా ఒట్టిపోయింది. నిధుల కొరత వల్ల తమ పరిధిలోని 35 మందిరాల నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆలయాల డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తూ BJP ఆందోళనకు దిగడంతో CM సుఖ్వీందర్ సింగ్‌కు ఏం చేయాలో తోచడం లేదు. మీ కామెంట్?

Similar News

News February 27, 2025

పోసానికి వైద్యపరీక్షలు.. విచారిస్తున్న ఎస్పీ

image

AP: పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకొచ్చిన పోలీసులు.. అక్కడే వైద్యుడితో మెడికల్ టెస్టులు చేయించారు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అనుచరులతో PSకు రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.

News February 27, 2025

న్యూజిలాండ్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

image

CT: మార్చి 2న NZతో మ్యాచులో IND కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వొచ్చని క్రీడా వర్గాలు తెలిపాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్ గిల్ కెప్టెన్సీ చేస్తారని పేర్కొన్నాయి. PAKతో మ్యాచులో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డారు. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆయన యాక్టివ్‌గా పాల్గొనలేదు. దీంతో NZతో మ్యాచుకు హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చి రాహుల్‌ను ఓపెనర్‌గా, పంత్‌ను WKగా ఆడిస్తారని వార్తలొస్తున్నాయి.

News February 27, 2025

జూ పార్క్ టికెట్ ధరలు భారీగా పెంపు

image

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.

error: Content is protected !!