News June 28, 2024
JP మోర్గాన్ ఇండెక్స్లో గవర్నమెంట్ బాండ్స్.. భారత మార్కెట్కు ప్లస్!
దిగ్గజ ఫైనాన్స్ కంపెనీ జేపీ మోర్గాన్ నేడు ప్రభుత్వ బాండ్లను ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్లో చేర్చింది. దీంతో భారతీయ బాండ్లకు డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సూచీలో స్థానం కల్పించడంపై 2023 SEPలో జేపీ మోర్గాన్ తొలిసారిగా ప్రకటన చేసింది. అప్పటి నుంచి విదేశాలు మన బాండ్లపై దాదాపు $11బిలియన్లు వెచ్చించాయి. మరో 10నెలల్లో $25B వరకు భారత్కు రావొచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది.
Similar News
News October 11, 2024
‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ REVIEW
ఇది కన్నతండ్రి(సాయిచంద్), పెంచిన తండ్రి(సాయాజీ షిండే), ఓ కొడుకు(సుధీర్బాబు) మధ్య ముక్కోణపు ఎమోషనల్ కథ. డైరెక్టర్ అభిలాష్ కొత్త తరహా కథాంశాన్ని ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. పెంచిన తండ్రి అప్పు తీర్చేందుకు హీరో కష్టాలు, కొడుకు ప్రేమకై తపించే కన్నతండ్రి యాంగిల్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు బాగున్నా పాత్రల మధ్య కొరవడిన భావోద్వేగాలు, స్లో నరేషన్, చివరి 20 నిమిషాలు మైనస్.
రేటింగ్: 2.5/5
News October 11, 2024
16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు
AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్ను ఆదేశించారు.
News October 11, 2024
OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల 13న విడుదలైన సూపర్ హిట్గా నిలిచింది. కాలభైరవ సంగీతం అందించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించారు. వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.