News August 4, 2024
భూములు కాజేసేందుకు ప్రభుత్వం కుట్ర: బండి

TG: HYD శివారులో ఫోర్త్ <<13756217>>సిటీ<<>> ఏర్పాటు వెనుకు కాంగ్రెస్ ప్రభుత్వ భూదందా కుట్ర ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వేల ఎకరాలను దోచుకోవాలని చూస్తోందని, KCR బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని దుయ్యబట్టారు. ధరణి, భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. KCR కుటుంబ భూదోపిడీపై ఏం చర్యలు తీసుకున్నారని HYD గుర్రంగూడ బోనాల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా బండి ప్రశ్నించారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


