News July 13, 2024
ఓడరేవుల ఆధునికీకరణపై ప్రభుత్వం ఫోకస్

AP: విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను రూ.27వేల కోట్లతో ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది. ఇదే అంశంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. పోర్టులను అనుసంధానిస్తూ రోడ్లు, వివిధ ప్రాజెక్టులు, లాజిస్టిక్ కారిడార్లను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని అధికారులకు సూచించారు.
Similar News
News April 5, 2026
ALERT: 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో 2 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులుంటాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఇవాళ 66 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కొన్నిజిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.
News April 5, 2026
RARE: ఒకే పోలికతో నలుగురు పిల్లల జననం

రష్యాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సెయింట్ పీటర్స్బర్గ్లో ఒకే పోలికతో ఉన్న నలుగురు పిల్లల(quadruplets)కు మహిళ జన్మనిచ్చింది. వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. 1.55 కోట్ల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రష్యాలో ఇలా జరగడం తొలిసారని తెలుస్తోంది.
News April 5, 2026
సౌర కుటుంబం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

*సోలార్ సిస్టమ్లో 99.86% సూర్యుడే ఉంటాడు
*శుక్రుడిని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు
*భూమికి ఉన్న ఏకైక నేచురల్ శాటిలైట్ చంద్రుడు
*సూర్యుడిని ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటారు
*మార్స్పై ఉన్న ఐరన్ ఆక్సైడ్ వల్ల దాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు
*1,300 భూములను కలిపితే ఒక గురుడు (జూపిటర్)
*జీవం ఉండే ఏకైక గ్రహం భూమి


