News November 23, 2024
రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం మాదే: BJP నేత ధీమా

మహారాష్ట్ర, ఝార్ఖండ్లో NDA కూటమే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని BJP అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుల, విభజన రాజకీయాలను రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఏక్ హై తో సేఫ్ హై’ నినాదాన్ని వారు అనుసరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలో లడ్కీ బెహనా, ఝార్ఖండ్లో అక్రమ వలసలు తీవ్ర ప్రభావం చూపించాయని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


