News April 6, 2024

జూన్ 4 లోపే రూ.20వేల కోట్ల అప్పునకు ప్రభుత్వం సిద్ధం: యనమల

image

AP: ఈ ఆర్థిక సంవత్సరం రెండో రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.4వేల కోట్ల అప్పు తెచ్చిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రోజుకు రూ.257 కోట్ల చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. 2024-25కు కేటాయించిన కోటాలో రూ.20వేల కోట్ల అప్పును ఎన్నికల కోడ్ అమల్లో ఉండే జూన్ 4 లోపే తీసుకునేందుకు అనుమతులు తెచ్చుకుందని ఆరోపించారు.

Similar News

News February 12, 2026

నమీబియాతో మ్యాచ్.. ప్రయోగాలు చేస్తారా?

image

USAపై గెలిచిన టీమ్ ఇండియా ఇవాళ T20 WCలో రెండో మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 7pmకు మొదలయ్యే మ్యాచులో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కోచ్ గంభీర్ సానూకూలంగా ఉండటంతో శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. బుమ్రాకు రెస్ట్ కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు అభిషేక్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ లేకపోగా టీమ్11లో ఉంటాడా అనేది అనుమానమే.

News February 12, 2026

బ్రిటీష్ అధికారికి స్వామివారి దర్శనం

image

బ్రిటీష్ కాలంలో సర్ థామస్ మన్రో అనే అధికారి మంత్రాలయ మఠం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా రాఘవేంద్ర స్వామి బృందావనం నుంచి బయటకు వచ్చి మన్రోకు దర్శనమిచ్చారు. ఆయనతో చర్చించి భూములను స్వాధీనం చేసుకోకుండా ఒప్పించారు. ఈ సంభాషణ గురించి మన్రో స్వయంగా ‘మద్రాస్ గెజిట్’లో నమోదు చేయడం విశేషం. ఓ పరాయి దేశస్థుడికి కూడా దర్శనమిచ్చిన స్వామివారి కరుణా సాగరం అనంతమైనది.

News February 12, 2026

1,495 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

image

TG: ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్‌ కోర్సుల విద్యార్థులు, 90,254 మంది వొకేషనల్‌ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.