News April 6, 2024

జూన్ 4 లోపే రూ.20వేల కోట్ల అప్పునకు ప్రభుత్వం సిద్ధం: యనమల

image

AP: ఈ ఆర్థిక సంవత్సరం రెండో రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.4వేల కోట్ల అప్పు తెచ్చిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రోజుకు రూ.257 కోట్ల చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. 2024-25కు కేటాయించిన కోటాలో రూ.20వేల కోట్ల అప్పును ఎన్నికల కోడ్ అమల్లో ఉండే జూన్ 4 లోపే తీసుకునేందుకు అనుమతులు తెచ్చుకుందని ఆరోపించారు.

Similar News

News February 8, 2026

జూన్ 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం

image

BRS నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ MLC కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పార్టీ పేరు, జెండా, అజెండాను లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి బృందం భారత ఎన్నికల సంఘాన్ని కలిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించింది. పార్టీ నిర్మాణంపై కసరత్తు ముమ్మరం చేసిన కవిత కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

News February 8, 2026

రేవంత్ అత్యంత దరిద్రపు సీఎం: KTR

image

TG: చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక CMగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని, ఆయన అత్యంత దరిద్రపు ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లుగా KCRను తిట్టడం తప్పించి చేసిందేమీ లేదన్నారు. రోజూ రూ.వందల కోట్లు దోచుకోవడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాకుంటే కాంగ్రెస్ వాళ్లు మరో మూడేళ్ల దాకా దొరకరని, వారికి బుద్ధి చెప్పాలని తాండూరు సభలో పిలుపునిచ్చారు.

News February 8, 2026

అరటిలో దుంపకుళ్లు తెగులు నివారణ ఎలా?

image

అరటి పంటలో దుంపకుళ్లు తెగులును నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆశిస్తే తోటలకు సరిపడా నీరివ్వాలి. తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసేసి తోట బయట చిన్న చిన్న ముక్కలుగా చేసి తగలబెట్టాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టి బాగా తడిచేలా 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్‌ను లీటరు నీటికి కలిపి తడపాలి. పశువుల ఎరువుతో వృద్ధి చేసిన సూడోమోనాస్‌ను మొక్కల మొదళ్ల దగ్గర వేస్తే తెగులు చాలా వరకు తగ్గుతుంది.