News April 6, 2024
జూన్ 4 లోపే రూ.20వేల కోట్ల అప్పునకు ప్రభుత్వం సిద్ధం: యనమల

AP: ఈ ఆర్థిక సంవత్సరం రెండో రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.4వేల కోట్ల అప్పు తెచ్చిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రోజుకు రూ.257 కోట్ల చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. 2024-25కు కేటాయించిన కోటాలో రూ.20వేల కోట్ల అప్పును ఎన్నికల కోడ్ అమల్లో ఉండే జూన్ 4 లోపే తీసుకునేందుకు అనుమతులు తెచ్చుకుందని ఆరోపించారు.
Similar News
News February 16, 2026
ఆదిలాబాద్ వైస్ ఛైర్మన్గా ఎండీ రోహిత్

ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్గా 44వ వార్డు కౌన్సిలర్ ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. సోమవారం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలో రోహిత్కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఛైర్పర్సన్ ఎన్నిక తరహాలోనే వైస్ ఛైర్మన్ ఎంపికలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఆయనకు ఓటు వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో రోహిత్ ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
News February 16, 2026
ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.
News February 16, 2026
బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

<


