News April 6, 2024

జూన్ 4 లోపే రూ.20వేల కోట్ల అప్పునకు ప్రభుత్వం సిద్ధం: యనమల

image

AP: ఈ ఆర్థిక సంవత్సరం రెండో రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.4వేల కోట్ల అప్పు తెచ్చిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రోజుకు రూ.257 కోట్ల చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. 2024-25కు కేటాయించిన కోటాలో రూ.20వేల కోట్ల అప్పును ఎన్నికల కోడ్ అమల్లో ఉండే జూన్ 4 లోపే తీసుకునేందుకు అనుమతులు తెచ్చుకుందని ఆరోపించారు.

Similar News

News February 13, 2026

మున్సిపల్ ఫలితాలు.. పలుచోట్ల హంగ్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, BRS 4, బీజేపీ 1, స్వతంత్రులు 1 చోట గెలిచారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 5, బీజేపీ 1, స్వతంత్రులు 2 చోట్ల గెలిచారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్, BRS చెరో 8 చోట్ల గెలిచాయి.

News February 13, 2026

మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం

image

TG: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో సంచలనం నమోదైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) విజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లో AIFB 8 చోట్ల, కాంగ్రెస్, BRS ఒక్కో స్థానంలో గెలిచాయి. ఆ ప్రాంతంలో మంచి పేరున్న వడ్డేపల్లి శ్రీనన్న కొద్ది రోజుల క్రితం కల్వకుంట్ల కవితకు చెందిన జాగృతిలో చేరారు. ఆయన మద్దతుదారులు AIFB గుర్తు (సింహం)పై పోటీ చేసి గెలిచారు.

News February 13, 2026

పురుషుల్లో తగ్గుతున్న Y క్రోమోజోమ్‌.. జీవితకాలం తగ్గే ప్రమాదం!

image

పురుషుల్లో ఉండే Y క్రోమోజోమ్ మగాళ్లు పుట్టడానికి కీలకం. వయసు పెరిగే కొద్దీ వారి కణాల నుంచి ఈ క్రోమోజోమ్‌ను కోల్పోతారని, దీనివల్ల నష్టం లేదని గతంలో సైంటిస్టులు భావించేవారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం Y క్రోమోజోమ్ తగ్గడం వల్ల పురుషులు తీవ్రమైన వ్యాధుల బారిన పడి జీవితకాలం తగ్గుతుందట. అయితే వారసుల్లో ఈ లోపం ఉండదని, మగాళ్ల పుట్టుకపై ఇప్పటికిప్పుడు ప్రభావం ఉండదని తేలింది. ఇది ఊరటనిచ్చే అంశం.