News August 16, 2024
LRS క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు జారీ

TG: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అనుమతి లేని, చట్టవిరుద్ధమైన లే ఔట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ చేసిన లే ఔట్లకు మాత్రమే LRS వర్తిస్తుందని తెలిపింది. అదే ఏడాది అక్టోబర్ 15లోపు స్వీకరించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.
Similar News
News November 4, 2025
మనం కూడా న్యూక్లియర్ టెస్టులు చేయాల్సిందేనా?

చైనా, పాకిస్థాన్ <<18185605>>న్యూక్లియర్<<>> వెపన్ టెస్టులు చేస్తున్నాయని ట్రంప్ చెప్పడం భారత్కు ఆందోళన కల్గించే విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1998 నుంచి భారత్ అణుపరీక్షలు జరపలేదు. 2025 నాటికి మన దగ్గర 180 వార్హెడ్స్ ఉంటే.. చైనాలో 600, పాకిస్థాన్లో 170 ఉన్నాయి. త్వరలో పాక్ 200, చైనా 1,000కి చేరే అవకాశం ఉంది. దీంతో భారత్ న్యూక్లియర్ టెస్టులు ప్రారంభించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News November 4, 2025
నెత్తుటి రహదారి.. 200 మందికి పైగా మృతి

TG: నిన్న <<18186227>>ప్రమాదం<<>> జరిగిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి(NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని 46 కి.మీ. రహదారిపై ఎక్కడపడితే అక్కడే గుంతలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 2018 నుంచి చోటు చేసుకున్న ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణించగా సుమారు 600 మంది గాయాలపాలయ్యారు. తాజాగా అన్ని అడ్డంకులు తొలిగి రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడంతో పనులు ప్రారంభం కానున్నాయి.
News November 4, 2025
లాటరీలో రూ.60 కోట్లు గెలిచాడు

UAEలో నివసించే శరవణన్ వెంకటాచలం అనే ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. ‘బిగ్ టికెట్ అబుదాబి 280’ అనే లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా 25 మి. దిర్హామ్స్(రూ.60 కోట్లు) గెలుచుకున్నారు. అబుదాబిలో నివసించే ఈయన OCT 30న ‘463221’ నంబరుతో ఉన్న టికెట్ కొనుగోలు చేశారు. నిన్న డ్రా తీయగా శరవణన్కు జాక్పాట్ తగిలింది. నిర్వాహకులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఈమెయిల్లో కూడా సంప్రదిస్తామని తెలిపారు.


