News February 7, 2025
కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన

TG: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
Similar News
News April 6, 2026
జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమైందా?

UCC(యూనిఫామ్ సివిల్ కోడ్), జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయని, మంచి పురోగతి కనిపిస్తోందని ఇవాళ BJP వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో జనగణన మొదలుకానుంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
News April 6, 2026
త్వరలోనే తులం బంగారం: మంత్రి శ్రీధర్ బాబు

TG: ఎన్నికల్లో తామిచ్చిన హామీలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసే లోపు వంద శాతం అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పటికే మెజార్టీ హామీలను నెరవేర్చామని తెలిపారు. అర్హులైన వధువులకు తులం బంగారం పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావాలనే 420 హామీలంటూ ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
News April 6, 2026
సీజ్ఫైర్ను తిరస్కరించిన ఇరాన్.. ట్రంప్ వార్నింగ్!

సీజ్ఫైర్పై పాకిస్థాన్ ద్వారా US పంపిన ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిగా 10 కండిషన్లు పెట్టింది. ఒక్క సీజ్ఫైర్తో సరిపెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. హార్ముజ్పై తమ కంట్రోల్కు గుర్తింపు, ఆంక్షలు ఎత్తివేత, నష్టపరిహారం మొదలైనవి డిమాండ్లుగా పేర్కొంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


