News February 17, 2025
విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలు.. ప్రభుత్వం ఉత్తర్వులు

AP: GOVT స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 7,784 మంది విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర పరిధిలో ఒక్కో స్టూడెంట్కు ₹200, ఇతర రాష్ట్రాలకు ₹2K చొప్పున ఖర్చు చేస్తామంది. నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపికపై సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.
Similar News
News January 21, 2026
HYDలో లారియల్ తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్

ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ కంపెనీ లారియల్(L’Oréal) HYDలో తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ CEO నికోలస్ సమావేశమై చర్చించారు. నవంబర్లో జరిగే ప్రారంభోత్సవానికి CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. ఆవిష్కరణలు, టెక్నాలజీ, Ai డేటాకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంస్థ ఆసక్తి చూపింది.
News January 21, 2026
మరో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఉదయం ఫ్లాట్గా మొదలై క్రమంగా కుప్పకూలాయి. నిఫ్టీ 25 వేల దిగువకు పడిపోయింది. 260 పాయింట్లు కోల్పోయి 24,950 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 935 పాయింట్లు పడి 81,250 వద్ద కొనసాగుతోంది. ట్రెంట్ షేర్లు 3%, ICICI బ్యాంక్ 2.52%, BE 2.1%, L&T 1.86% నష్టపోయాయి. అటు డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ సైతం భారీగా పడిపోయింది. డాలర్కు రూ.91.31 వద్ద ట్రేడవుతోంది.
News January 21, 2026
మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోతే?

మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోయినా, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా నీటితో స్నానం వీలుపడకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన పురాణాలు ఇందుకు మంత్ర, వాయువ్య, ఆగ్నేయ, కాపిల, ఆతప, మానస వంటి ప్రత్యామ్నాయ స్నాన పద్ధతులను సూచించాయి. మహావిష్ణువును మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ చేసే ‘మానస స్నానం’ అన్నింటికంటే ఉత్తమమైనది. భక్తితో భగవంతుడిని స్మరిస్తే మనసు శుద్ధి అవుతుంది. ఇలా భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు.


