News February 17, 2025
విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలు.. ప్రభుత్వం ఉత్తర్వులు

AP: GOVT స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 7,784 మంది విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర పరిధిలో ఒక్కో స్టూడెంట్కు ₹200, ఇతర రాష్ట్రాలకు ₹2K చొప్పున ఖర్చు చేస్తామంది. నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపికపై సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.
Similar News
News January 11, 2026
ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో ఉద్యోగాలు

ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో 45 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JSOకు నెలకు రూ.68,697, JSAకు రూ.42,632 చెల్లిస్తారు. https://fsl.delhi.gov.in
News January 11, 2026
ఇంటికి చేరుకోవడమే పెద్ద ‘పండుగ’

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ట్రాఫిక్, మరోవైపు సమయానికి బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకోవడమే పెద్ద పండుగగా భావిస్తున్నారు. VJA-HYD హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అటు HYDలోని బస్టాండ్లలో వచ్చిన వెంటనే బస్సులు కిక్కిరిసిపోతుండటంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
News January 11, 2026
సారీ.. ఆ మెయిల్స్ను పట్టించుకోవద్దు: డేటా లీక్పై ఇన్స్టాగ్రామ్

యూజర్ల సెన్సిటివ్ <<18820981>>డేటా లీక్<<>> అయినట్లు వచ్చిన వార్తలను ఇన్స్టాగ్రామ్ ఖండించింది. యూజర్లు పాస్వర్డ్ మార్చుకోవాలని తమ పేరుతో వచ్చిన మెయిల్స్ను పట్టించుకోవద్దని కోరింది. అలా మెయిల్స్ రావడానికి కారణమైన సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. ప్రతిఒక్కరి ఇన్స్టా ఖాతా సేఫ్గా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా క్రియేట్ అయిన గందరగోళానికి క్షమాపణలు చెప్పింది.


