News February 17, 2025
విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలు.. ప్రభుత్వం ఉత్తర్వులు

AP: GOVT స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 7,784 మంది విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర పరిధిలో ఒక్కో స్టూడెంట్కు ₹200, ఇతర రాష్ట్రాలకు ₹2K చొప్పున ఖర్చు చేస్తామంది. నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపికపై సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.
Similar News
News January 16, 2026
ESIC మెడికల్ కాలేజీ&హాస్పిటల్లో ఉద్యోగాలు

నోయిడాలోని<
News January 16, 2026
జస్టిస్ యశ్వంత్ వర్మకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

తనపై పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తును సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తుల విచారణ చట్టం 1965 ప్రకారం ఉమ్మడి కమిటీ తప్పనిసరి అనే ఆయన వాదనను తోసిపుచ్చింది. లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తదుపరి చర్యలు చేపట్టడానికి అడ్డంకులను తొలగిస్తూ తీర్పు వెలువరించింది. 2025 మార్చిలో యశ్వంత్ నివాసంలో భారీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.
News January 16, 2026
తప్పిన యుద్ధ గండం: అరబ్ దేశాల దౌత్యంతో వెనక్కి తగ్గిన ట్రంప్!

ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. నిరసనకారులపై కాల్పులు, ఉరిశిక్షలను ఇరాన్ నిలిపివేసిందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక సౌదీ, ఖతర్, ఒమన్ దేశాల ‘మధ్యరాత్రి దౌత్యం’ పనిచేసినట్లు తెలుస్తోంది. యుద్ధం వల్ల ప్రాంతీయ అస్థిరత ఏర్పడి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశాలు హెచ్చరించడంతో ట్రంప్ శాంతించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి యుద్ధ భయాలు తొలగినట్లే!


