News August 8, 2024

వారికి రూ.10,000 ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: బ్రెయిన్ డెడ్‌తో మరణించి అవయవదానం చేసిన వారి పార్థివదేహాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్/సీనియర్ అధికారి ఈ సంస్కారాల్లో పాల్గొనాలని ఆదేశించింది. దాతల కుటుంబాలకు ₹10,000 పారితోషికం, ప్రశంసా పత్రాలు అందించాలని మంత్రి స‌త్య‌కుమార్ చొర‌వ‌తో ఉత్తర్వులు ఇచ్చింది. అవయవ సేకరణ అనంతరం ఆస్పత్రి నుండి భౌతికకాయం ఉచితంగా తరలించాలంది.

Similar News

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

News November 21, 2025

పురుషుల జీవితంలో అష్టలక్ష్ములు వీళ్లే..

image

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధించాలంటే ఆ ఇంట్లో మహిళల కటాక్షం ఎంతో ముఖ్యం. తల్లి (ఆదిలక్ష్మి) నుంచి కూతురు (ధనలక్ష్మి) వరకు, ప్రతి స్త్రీ స్వరూపం అష్టలక్ష్మికి ప్రతిరూపం. వారిని ఎప్పుడూ కష్టపెట్టకుండా వారి అవసరాలను, మనసును గౌరవించి, సంతోషంగా ఉంచడమే నిజమైన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీలను గౌరవిస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.