News August 8, 2024
వారికి రూ.10,000 ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు

AP: బ్రెయిన్ డెడ్తో మరణించి అవయవదానం చేసిన వారి పార్థివదేహాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్/సీనియర్ అధికారి ఈ సంస్కారాల్లో పాల్గొనాలని ఆదేశించింది. దాతల కుటుంబాలకు ₹10,000 పారితోషికం, ప్రశంసా పత్రాలు అందించాలని మంత్రి సత్యకుమార్ చొరవతో ఉత్తర్వులు ఇచ్చింది. అవయవ సేకరణ అనంతరం ఆస్పత్రి నుండి భౌతికకాయం ఉచితంగా తరలించాలంది.
Similar News
News November 23, 2025
AI ఎఫెక్ట్.. అకౌంట్ లాక్ చేసుకున్న ‘బందనా గర్ల్’

సెల్ఫీ వీడియోతో పాపులారిటీ సంపాదించుకున్న <<18363367>>‘బందనా (తలకు కట్టుకునే వస్త్రం) గర్ల్’<<>> ఎక్స్ అకౌంట్ లాక్ చేసుకున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా కొందరు AI ఫొటోలను క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ‘ఈ రోజు మేకప్ బాగా కుదిరింది’ అంటూ ఆమె ఆటోలో తీసుకున్న 2 సెకన్ల వీడియో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.
News November 23, 2025
సంజూ మరో‘సారీ’

భారత ప్లేయర్ సంజూ శాంసన్కు వన్డేల్లో మరోసారి నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో ఈ స్టార్ ప్లేయర్కు చోటు దక్కలేదు. జడేజా చాలా రోజుల తర్వాత వన్డేలకు ఎంపికయ్యారు. ఎన్నో రోజులుగా చోటు కోసం ఎదురుచూస్తున్న రుతురాజ్ సైతం టీమ్లోకి వచ్చారు. అయితే వన్డేల్లో మెరుగైన గణాంకాలు ఉన్నా రెండేళ్లుగా సంజూను ఎంపిక చేయకపోవడం దారుణమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మీ కామెంట్?
News November 23, 2025
ఆహా.. ఓహో! అంతా అరచేతిలో స్వర్గమేనా?

AP: ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ అంటే పోటీ ప్రకటనలు, ప్రదర్శనల వేదికలుగా మారుతున్నాయా? జగన్ CMగా ఉండగా 340 కంపెనీలు ₹13 లక్షల కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపాయని నాటి ప్రభుత్వం చెప్పింది. ఇక 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా 625 కంపెనీలు ₹13.25 లక్షల కోట్ల ఇన్వెస్ట్కు ఇంట్రస్ట్ చూపాయని CBN తాజా ప్రభుత్వ స్టేట్మెంట్. వాస్తవ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలు ప్రకటనలకు దగ్గరగా ఉన్నాయా? అంటే ఆన్సర్ మీకు తెలుసుగా!


