News December 1, 2024
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం

TG: అధికారంలోకి వచ్చాక చేపట్టిన ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై ఆయన GHMC ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలను ప్రజలకు తెలిసేలా కృషి చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Similar News
News November 28, 2025
కోటిలింగాల ఆలయానికి ₹2,73,695 ఆదాయం

కార్తీకమాసం ముగిసిన సందర్భంగా కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి మొత్తం రూ.2,73,695 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అధికారులు హామీ ఇచ్చారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజా మొగిలి, ఈవో కాంతరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేష్ పాల్గొన్నారు.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


