News August 26, 2024

ప్రభుత్వం ‘భరోసా’ను పక్కన పెట్టేసింది: BRS

image

TG: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. ‘అధికారం కోసం రైతు భరోసా రూ.15,000 ఇస్తానని మాయ మాటలు చెప్పి, తీరా గద్దెనెక్కాక రేవంత్ సర్కార్ ఆ హామీని పక్కన పెట్టేసింది. వానాకాలం అయిపోతున్నా డబ్బులు రాకపోవడంతో రైతుల ఆశలు అడియాశలే అయ్యాయి. సకాలంలో పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతల నడ్డి విరుస్తోంది’ అని BRS ట్వీట్ చేసింది.

Similar News

News December 13, 2025

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 13, 2025

వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

image

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News December 13, 2025

2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

image

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.