News November 7, 2024

సమగ్ర సర్వే దేని కోసమో ప్రభుత్వం చెప్పాలి: DK అరుణ

image

TG: ప్రభుత్వం చేస్తోన్న సమగ్ర కుటుంబ సర్వే దేని కోసమో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని BJP MP డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళి కులగణనకు విరుద్ధంగా ఉందన్నారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అనే విషయాలు అడుగుతున్నారని, అవన్నీ ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

Similar News

News October 19, 2025

నేడు ఇలా చేస్తే చాలా మంచిది

image

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.

News October 19, 2025

దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

image

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ నాడు దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని పాటిస్తున్నాం. దీనివల్ల మనపై దేవి అనుగ్రహం చూపుతారని, ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.
* రోజూ ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 19, 2025

రాష్ట్రంలో ACB మెరుపు దాడులు

image

TG: రాష్ట్రంలో రవాణాశాఖ చెక్‌పోస్టులపై ACB మెరుపు దాడులు చేపట్టింది. అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా, ఆసిఫాబాద్(D)లోని వాంకిడి, సంగారెడ్డి(D)లోని జహీరాబాద్, కామారెడ్డి(D)లోని కామారెడ్డి, మద్నూరు, భద్రాద్రి(D)లోని అశ్వారావుపేట చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టి పలువురిని ప్రశ్నించింది. రవాణాశాఖ చెక్‌పోస్టులపై ACB ఏకకాలంలో దాడులు చేపట్టడం ఇది రెండోసారి.