News March 8, 2025

టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ప్రభుత్వం ఒప్పందం

image

AP: టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.49వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మంత్రులు లోకేశ్, గొట్టిపాటి రవి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అలాగే పాలనలో AI, సాంకేతికతను వేగవంతం చేసేందుకు వాద్వానీ ఫౌండేషన్‌తో ప్రభుత్వం MOU చేసుకుంది.

Similar News

News December 10, 2025

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

image

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.

News December 10, 2025

IISERBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌( <>IISERB<<>>)15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 23వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని DEC 30వరకు పంపాలి. పోస్టును బట్టి BSc, MSc, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. Jr టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 33ఏళ్లు కాగా, Jr అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్‌కు 30ఏళ్లు. వెబ్‌సైట్: recruitment.iiserb.ac.in

News December 10, 2025

పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

image

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.