News June 15, 2024
అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

AP: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో అధికారులు రంగంలోకి దిగారు. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితి, అవసరమయ్యే ఫర్నీచర్, ఇతర అవసరాలపై నివేదిక రూపొందిస్తున్నారు.
Similar News
News November 21, 2025
విశాఖలో ‘కాగ్నిజెంట్’.. JAN నుంచి కార్యకలాపాలు!

AP: దిగ్గజ IT కంపెనీ కాగ్నిజెంట్ వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో తొలుత డెలివరీ సెంటర్ను 800 మంది ఉద్యోగులతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇతర కాగ్నిజెంట్ సెంటర్లలో పనిచేసే కొందరిని ఇక్కడికి తరలించనుంది. కాగా ప్రభుత్వం ఈ కంపెనీకి కాపులుప్పాడలో 21.33 ఎకరాలను కేటాయించింది. రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం, 8వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.
News November 21, 2025
బిజినెస్ కార్నర్

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.
News November 21, 2025
ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


