News July 31, 2024

ఎరువుల వ్యాపారులకు ప్రభుత్వం వార్నింగ్

image

TG: నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల క్రయవిక్రయాలు జరిపే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లను వెంటనే స్వాధీనం చేసుకుని మరొకరికి అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు, సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొంది. రైతులకు ఎరువులు సజావుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Similar News

News February 1, 2025

ముగిసిన సీఎం సమీక్ష

image

TG: మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సుదీర్ఘంగా జరిగిన భేటీలో వివిధ శాఖలు, రంగాలకు బడ్జెట్ అవసరాలపై చర్చలు జరిపారు. నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.

News February 1, 2025

తక్కువ వడ్డీతో రూ.5లక్షల రుణం.. ఇలా చేయండి

image

కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని కేంద్రం రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. కౌలు రైతులు, భూ యజమాని-సాగుదారులు, వాటాదారులు, వ్యవసాయం లేదా చేపలు పట్టడం లేదా పశుపోషణ వంటి లేదా డ్వాక్రా సభ్యులు ఈ కార్డు తీసుకునేందుకు అర్హులు. వడ్డీ కేవలం 4శాతం(7శాతంలో 3% కేంద్రం రాయితీ) ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనా కార్డు తీసుకోవచ్చు. రూ.2లక్షలలోపు రుణానికి పూచీకత్తు అవసరం లేదు.

News February 1, 2025

APకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి: పవన్

image

AP: కేంద్ర బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఈ బడ్జెట్ వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది. ఏపీకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి. పోలవరం విషయంలో సవరించిన అంచనాలకు ఆమోదంతో ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధుల కేటాయింపుతో ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని తేలింది’ అని పవన్ అన్నారు.