News July 24, 2024
తండాలు, గూడేల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: CM రేవంత్

TG: నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్వశ్చన్ అవర్లో శాసన సభ్యుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘తండాలు,గూడేల్లో విద్య, విద్యుత్, రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. సరైన రవాణా సౌకర్యం ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని రేవంత్ తెలిపారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


