News November 6, 2024

ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 3, 2026

క్రేజీ కాంబో.. ధురంధర్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ?

image

‘ఉరి’, ‘ధురంధర్’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు టాక్. ఆదిత్య తన కలల ప్రాజెక్ట్‌ను బన్నీకి వినిపించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ధురంధర్-2 మార్చిలో రిలీజైన తర్వాత ఈ భారీ పాన్ ఇండియా మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అట్లీ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ ఓ మూవీ చేస్తుండగా.. లోకేశ్, త్రివిక్రమ్‌తోనూ సినిమాలు కమిట్ అయినట్లు సమాచారం.

News February 3, 2026

వెజైనల్​ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

image

మహిళల్లో వైట్​ డిశ్చార్జ్​ సాధారణమే అయినా దాని రంగు మారినా, వజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్నిరకాల ఇన్ఫెక్షన్స్​ వల్ల ఫెలోపియన్​ ట్యూబ్స్​ బ్లాక్​ అవుతాయి. కొన్నిసార్లు ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ రావొచ్చు. దీన్ని త్వరగా గుర్తించకపోతే ఫెలోపియన్​ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News February 3, 2026

పాలు లేకుండా ఎవరైనా నెయ్యి చేయగలుగుతారా: పయ్యావుల

image

AP: నెయ్యి తయారీకి పాలు అవసరం లేదన్నట్లు రూలు మార్చారంటే దాని వెనుక దురుద్దేశం ఉన్నట్టా? లేనట్టా? అని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ‘నిబంధనలు మార్చాకనే బోలేబాబా వంటి సంస్థలు వచ్చాయి. ఛైర్మన్ సుబ్బారెడ్డి PA అప్పన్న లీటర్‌కు రూ.25 ఇవ్వాలని అడిగితే అది తిరస్కరించింది. దీంతో బ్లాక్ లిస్టులో పెట్టించగా వైష్ణవీ డెయిరీతో కలిసి దొడ్డిదారిన మళ్లీ వచ్చింది. ఇవన్నీ విచారణలో తేలాయి’ అని పేర్కొన్నారు.