News November 6, 2024

ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 1, 2025

మద్యం ఫీజుల రాకతో బకాయి నిధులు విడుదల

image

TG: లిక్కర్ షాపుల లైసెన్సు ఫీజుల కింద ₹2,854 కోట్లు రావడంతో ప్రభుత్వం పలు విభాగాల్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తోంది. విద్యార్థులకు ₹304 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ₹252 కోట్లు రిలీజ్ చేసింది. ఇవి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో మున్సిపాల్టీలు, పంచాయతీల రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రతి విభాగంలో కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించేందుకు ₹1కోటి చొప్పున ఇవ్వనుంది.

News November 1, 2025

శ్రేయస్ అయ్యర్ డిశ్ఛార్జ్

image

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడిన టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని BCCI వెల్లడించింది. శ్రేయస్ రికవర్ కావడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ఫాలోఅప్ కోసం కొన్ని రోజులు ఆయన సిడ్నీలోనే ఉంటారని వివరించింది. సిడ్నీ, ఇండియా డాక్టర్లకు థాంక్స్ చెప్పింది. శ్రేయస్‌కు ఇటీవల <<18131470>>సిడ్నీ వైద్యులు<<>> మైనర్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే.

News November 1, 2025

అధికారులు అద్భుతంగా పని చేశారు: CM చంద్రబాబు

image

AP: మొంథా తుఫాన్ సమయంలో అధికారులు అద్భుతంగా పని చేశారని CM చంద్రబాబు ప్రశంసించారు. పెను ప్రమాదం తప్పిందని, ముందు జాగ్రత్తతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించామని అన్నారు. తన జీవితంలో చాలా తుఫాన్లు చూశానని, ఈ సారి యంత్రాంగం, టెక్నాలజీ సాయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. 602 డ్రోన్లను వినియోగించి ట్రాక్ చేశామన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సన్మాన పత్రాలు, మెమెంటోలు అందజేశారు.