News November 6, 2024
ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 15, 2025
సమ్మె విరమించమని కోరాం: భట్టి

TG: ప్రైవేటు కళాశాలలు <<17708995>>బందు<<>>కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో Dy.CM భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.
News September 15, 2025
ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘ఇండియా పోస్ట్’ పేరిట ఫేక్ మెసేజులు పంపుతున్నారు. ‘మీ పార్సిల్ వేర్ హౌస్కి చేరుకుంది. అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ కుదర్లేదు. ఈ లింక్ ఓపెన్ చేసి 48 గంటల్లోగా అడ్రస్ అప్డేట్ చేయండి. లేదంటే పార్సిల్ రిటన్ వెళ్లిపోతుంది’ అని మెసేజ్లు పంపుతున్నారు. అవన్నీ ఫేక్ అని PIB FACT CHECK తేల్చింది. మీ వాళ్లకి ఈ విషయం షేర్ చేయండి.
News September 15, 2025
చలికాలం మరింత చల్లగా ఉండనుంది: నిపుణులు

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లా నినా వల్ల చలి తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. ఎల్ నినో దక్షిణ ఆసిలేషన్ సైకిల్లో శీతల దశైన లా నినా.. భూమధ్య రేఖ పసిఫిక్లో సముద్ర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది అంటున్నారు. దాంతో వాతావరణంపై ప్రభావం ఉండనుంది. భారత్లో గతంలో కంటే చలి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.