News April 3, 2024

పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి, వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విభాగాల పెన్షన్ దారులు సచివాలయాలకు రానవసరం లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్లను కోరింది. ఎండల దృష్ట్యా ఉ.7 గంటల నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించింది.

Similar News

News April 8, 2026

సమ్మర్‌లో ఇది నానబెట్టుకుని తింటే..

image

సమ్మర్‌లో గోండ్ కటీరా బాడీని కూల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక నేచురల్ గమ్. Astragalus species అనే మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. రాత్రి ఒక స్పూన్ కటీరాను గ్లాసు నీటిలో నానబెడితే జెల్లీలా తయారవుతుంది. దీన్ని షర్బత్, పాలు, నిమ్మరసంలో కలుపుకొని తాగాలి. డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. వెంట్రుకలు, చర్మ ఆరోగ్యానికీ మంచిది.

News April 8, 2026

BSNL ఫైబర్.. రూ.399తో 50Mbps వేగంతో హైస్పీడ్ డేటా

image

BSNL ఫైబర్ యూజర్లకు అదిరిపోయే న్యూస్. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికోసం BSNL సరికొత్త ‘స్పార్క్’ ఫైబర్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం నెలకు రూ.399 చెల్లిస్తే 50 Mbps వేగంతో 3300GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అలాగే ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ రూ.399 ధర మొదటి 12 నెలలు మాత్రమే వర్తిస్తుందని, 13వ నెల నుంచి రూ.449కి మారుతుందని సంస్థ స్పష్టం చేసింది.

News April 8, 2026

ఇంటర్ రిజల్ట్స్ వార్తలు ఫేక్.. నమ్మొద్దన్న బోర్డు!

image

AP: ఇంటర్ ఫలితాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. ఏప్రిల్ 12న రిజల్ట్స్ విడుదలవుతాయనే వార్తలు పూర్తిగా అబద్ధమని బోర్డు కమిషనర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఫలితాల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విద్యార్థులు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రిజల్ట్స్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తామని చెప్పారు.